తెలంగాణ బడ్జెట్
హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.
ఏపీ బడ్జెట్ వాయిదా
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా ఇవాళ ఏపీ అసెంబ్లీ, మండలికి సెలవు. ఈ నెల 15 లేదా 16న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాళ్టి ఏపీ కేబినెట్ సమావేశం కూడా రద్దయింది.
నేడు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు
తీవ్ర గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి(54) అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్లగడ్డలోని శోభా ఘాట్ వద్ద జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు నేతలు భూమా నాగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
గవర్నర్ను కలవనున్న ఇబోబి సింగ్
మణిపూర్ సీఎల్పీ నేత ఇబోబి సింగ్ ఇవాళ గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్ను కోరనున్నారు. మరోపక్క మణిపూర్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరుమలలో సాధారణ రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 7 గంటలు, నడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.