విద్యుత్ చార్జీల పెంపు
ఇవాళ్టి నుంచి ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలు అమలు. 3.6 శాతం పెరిగిన విద్యుత్ చార్జీలు. చార్జీల పెంపుతో ప్రజలపై 800 కోట్ల భారం.
ఎస్బీఐలో విలీనం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా.
మలేసియా ప్రధానితో మోదీ భేటీ
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మలేసియా ప్రధాని భేటీ. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ.
పాల ధర పెంపు
హైదరాబాద్: విజయ పాల ధర లీటరుపై రూపాయి పెంపు. పెరిగిన ధర ఇవాళ్టి నుంచి అమలు.
హైవేలపై మద్యం బంద్
నేటి నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని సుప్రీం కోర్టు ఆదేశం. తెలంగాణలో సెప్టెంబర్ 30, ఏపీలో జూన్ 30 వరకు గడువు.
► టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా తమ ప్రైమ్ ఆఫర్ కింద సభ్యత్వ నమోదు పథకాన్ని ఏప్రిల్ 15 దాకా పొడిగించింది.