నేటి నుంచి బడిబాట
హైదరాబాద్: నేటి నుంచి బడిబాట కార్యక్రమం మొదలు. బడిబాటలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించేలా టీచర్లు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు.
ఆర్థిక మంత్రుల సమావేశం
నేడు ఢిల్లీలో సౌత్ ఏసియా సబ్రీజనల్ ఎకనమిక్ కొ-ఆపరేషన్(ఎస్ఏఎస్ఈసీ) దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షత వహిస్తారు.
గల్ఫ్ బాధితులకు విముక్తి
నేడు స్వదేశానికి చేరుకున్న 33 మంది తెలుగు రాష్ట్రాల గల్ఫ్ బాధితులు. ఏజెంట్ల మోసంతో ఇరాక్లో చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికులకు విముక్తి లభించింది.
గ్రూప్-2 ఫలితాలు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో కేంద్ర బృందం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. మిషన్ కాకతీయ పనులను పరిశీలించనున్న కేంద్ర బృందం.
మార్కెట్యార్డుకు కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఇవాళ మలక్పేట మార్కెట్ యార్డును పరిశీలించనున్నారు.