నేటి వార్త విశేషాలు

18 Feb, 2016 06:36 IST|Sakshi

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖలో పర్యటన, శారదాపీఠంలో మహా కుంభాభిషేకానికి హాజరుకానున్న వైఎస్ జగన్
*కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ నేడు విశాఖలో పర్యటన. వామపక్ష తీవ్రవాదంపై ఏపీ సీఎస్, డీజీపీతో రాజ్నాథ్ సమీక్ష. రాత్రికి విశాఖలో బస చేయనున్న రాజ్నాథ్. రేపు ఉదయం ఒడిశాకి వెళ్లనున్న రాజ్నాథ్.
*నేడు మహాజాతరలో గద్దెపైకి రానున్న సమ్మక్క
*నేడు ఏపీఎస్ ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు
*నేడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య పర్యటన
*నేడు హైదరాబాద్ రానున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. జీహెచ్ఎంసీ ఎన్నికలు, నారాయణఖేడ్ ఉప ఎన్నికపై టీపీసీసీ
నేతలతో చర్చించనున్న దిగ్విజయ్.
*కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు విశాఖలో పర్యటన. ఎలక్ట్రానిక్ రీసెర్చ్, ఇంక్యూబేషన్ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్న రవిశంకర్ ప్రసాద్, సీఎం చంద్రబాబు
*నేటి నుంచి ఈ నెల 22 వరకు తెలంగాణ డీఈఈ సెట్ వెబ్ ఆప్షన్లు

మరిన్ని వార్తలు