హరితహారంలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు

11 Jul, 2016 15:54 IST|Sakshi
హరితహారంలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు

తెలంగాణకు హరిత హారం అంటూ సీఎం కేసీఆర్ ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. టాలీవుడ్ నటీనటులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి గ్లామర్ రంగులు అద్దారు. సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నాటి, నేటి హీరోలు, హీరోయిన్లు పాల్గొని స్వయంగా మొక్కలు నాటి అభిమానులను కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, దగ్గుబాటి రానా, అల్లు అర్జున్, చిరంజీవిలతో పాటు.. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, లక్ష్మి మంచు, రెజినా కాసాండ్రా.. ఇలా పలువురు పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు సైబరాబాద్ కమిషనరేట్తో పాటు గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్లో మొక్కలు నాటారు.

>
మరిన్ని వార్తలు