రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని

2 Oct, 2016 04:06 IST|Sakshi
రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శనివారం మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘాల సభ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 పెద్ద, 17 మధ్య స్థాయి, 53 చిన్న రిజర్వాయర్లు, 35,031 చెరువులు ఉన్నాయని.. వాటిలో 4,553 చెరువులు, రిజర్వాయర్లలో 48 కోట్ల వ్యయంతో 34.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు