రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ

30 Dec, 2016 16:30 IST|Sakshi
రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ

హైదరాబాద్: బొల్లారంలోని రాష్గ్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీపీసీసీ బృందం శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు  సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ చట్టానికి చేసిన సవరణలపై కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు.

కొత్తగా ఆమోదం పొందిన బిల్లుతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

>
మరిన్ని వార్తలు