హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

24 Jun, 2017 09:24 IST|Sakshi
హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ సిటీ:  తెలంగాణ ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఆదివారం 10కే, 5కే, 2కే రన్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి 8 వరకు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

వీవీ విగ్రహం (ఖైరతాబాద్‌ చౌరస్తా) వైపు నుంచి ఫ్లైఓవర్, నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను షాదన్‌ కాలేజ్, నిరంకారి భవన్‌ వైపు మళ్లిస్తారు.

తెలుగుతల్లి చౌరస్తా వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హెలీప్యాడ్‌ లైన్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ మీదుగా పంపిస్తారు.

ఇక్బాల్‌ మీనార్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం ఓల్డ్‌ గేట్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదికి పంపిస్తారు.

లిబర్టీ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కేఆర్‌ భవన్, తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్‌ మీనార్‌ (యూ టర్న్‌) మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పైకి పంపిస్తారు.

కర్బాలా వైపు నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను చిల్ట్రన్స్‌ పార్క్‌ నుంచి డీబీఆర్‌ మిల్స్, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా మళ్లిస్తారు.

నల్లగుట్ట నుంచి సంజీవయ్యపార్క్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మీదుగా పంపిస్తారు.

డీబీఆర్‌ మిల్స్‌ నుంచి ట్రాఫిక్‌ను అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదికి అనుమతించరు.

మరిన్ని వార్తలు