3న టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం

29 Dec, 2015 10:32 IST|Sakshi

హైదరాబాద్‌: జనవరి 3న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది.

ఈ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశంలో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, భవిష్యత్‌ కార్యచరణపై చర్చించనున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు