కాంగ్రెస్‌ నాయకులది జిల్లాకో మాట

20 Aug, 2017 01:24 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నాయకులు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తూ జిల్లాకో మాట మాట్లాడుతు న్నారని పాలమూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిప డ్డారు. కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ నాయకుల తీరు చూస్తుంటే నల్లగొండ జిల్లాకో న్యాయం, మహబూబ్‌నగర్‌ జిల్లాకో న్యాయం అన్న విధంగా ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు మంత్రుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి వల్లే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెరిగిందన్నారు. సమ స్యను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు.  ‘కాంగ్రెస్‌ నేతలు కోర్టుకు వెళ్లడం వల్లే పాలమూరు ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. క్షమాపణ చెప్పాలని జూపల్లిని డిమాండ్‌ చేయడం కాదు. కోర్టుకెళ్లిన కాంగ్రెస్‌ నేతలతో క్షమాపణ చెప్పించాలి’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు