ఎమ్మెల్సీ స్థానానికి ఫరీదుద్దీన్ ఏకగ్రీవ ఎన్నిక !

3 Oct, 2016 15:41 IST|Sakshi
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలకు సోమవారం మధ్యాహ్నంతో గడువు ముగిసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఫరీదుద్దీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 
 
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరగనుంది. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 17 వరకు గడువుంది. ఆ రోజున ఫరీదుద్దీన్ ఎన్నికను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.
 
మరిన్ని వార్తలు