మేడారానికి పోటెత్తిన లక్షలాది భక్తులు

17 Feb, 2016 22:34 IST|Sakshi

మేడారం: వరంగల్ జిల్లా మేడారం పండుగ కళను సంతరించుకుంది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ప్రారంభమైన తొలిరోజున భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర నేపథ్యంలో ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ 2,745 బస్సు సర్వీసులను  ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కల్పించిన బస్సు సర్వీసుల సాయంతో సాయంత్రం ఆరు గంటల వరకు 1,24,238 మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు తెలిపారు. ఈ నెల 20 వరకు కన్నుల పండువగా ఈ జాతర కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

మరిన్ని వార్తలు