టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు

11 Mar, 2016 19:09 IST|Sakshi
టీవీ నటికి మెసేజ్‌లతో వేధింపులు

హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర సందేశాలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ బుల్లి తెర నటి బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే ఎస్. భారతి(40) కొన్ని టీవీ షోలలో నటిస్తోంది. గత మూడు నెలల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్ ల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ భారతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు