హైదరాబాద్: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న పాత నేరస్తులను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్నగర్ మండలం కోహెడ గ్రామంలో సీసీ కెమెరాల విజువల్ ఆధారంగా వీరస్వామి, సురేందర్ అనే పాత నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన 3.5 తులాల బంగారు ఆభరణాలను, మరో బైక్ను స్వాధీనం చేసుకున్నారు.