హైదరాబాద్:
నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 40 వేల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు రత్నగిరి, కిషోర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అమెరికా నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.