కృష్ణాష్టమితో ‘మలుపు’ ఖాయం..

16 Feb, 2016 00:04 IST|Sakshi
కృష్ణాష్టమితో ‘మలుపు’ ఖాయం..

తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధం కావడం ఆనందంగా ఉందని సినీనటి నిక్కీ గర్లాని అన్నారు. సునీల్‌తో కలిసి ఆమె నటించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో సందడి చేశారు. ఆ సినిమా విశేషాలను శ్రోతలతో పంచుకున్నారు. తాను నటించిన మరో చిత్రం ‘మలుపు’ కూడా రిలీజ్‌కు సిద్ధమైందని, రెండూ హిట్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను బెంగళూరుకు చెందిన అమ్మాయినే అయినా ఈ చిత్రాల కోసం తెలుగు నేర్చుకున్నానని    చెప్పారు.                                              - బంజారాహిల్స్

మరిన్ని వార్తలు