కారు బోల్తా: ఇద్దరికి గాయాలు

29 Sep, 2016 17:08 IST|Sakshi

హైదరాబాద్‌ సిటీ: హయత్‌నగర్ మండలం ఈనమగూడ వద్ద 66వ నెంబర్ జాతీయరహదారిపై మారుతీ కారు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హయత్‌నగర్లోని టైటన్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా చిట్యాలకు వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు