బస్సు - టిప్పర్ ఢీ : ఇద్దరు మృతి

23 Jul, 2016 08:15 IST|Sakshi
బస్సు - టిప్పర్ ఢీ : ఇద్దరు మృతి

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు - టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు