రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

14 Apr, 2015 15:59 IST|Sakshi

నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలోగల షాదన్ కాలేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రయాణిస్తోన్న ద్విచక్రవాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను మహ్మద్ నదీం, నసీర్ బిన్ సలేహ్ బిన్ అపేన్‌ గా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, బంధువులకు సమాచారం అంజేస్తామని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు