ఉత్తమ్ పై దాడికి యత్నించిన ఇద్దరు లొంగుబాటు

3 Feb, 2016 12:38 IST|Sakshi

 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తో పాటు షబ్బీర్ అలీపై దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. పాతబస్తీలో పోలింగ్ సందర్భంగా భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడటం వల్ల కోపోద్రిక్తులైన మహమ్మద్ ఆబిద్, మహమ్మద్ కశాప్ అనే ఇద్దరు వ్యక్తులు టీపీసీసీ అధ్యక్షుడిపై దాడికి యత్నించారు. ఎంఐఎం రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించడంతోనే ఇలా చేసామని నిందితులు సౌత్ జోన్ డీసీపీ ఎదుట లొంగిపోయారు.



 

మరిన్ని వార్తలు