డ్రైనేజీలో పడి ఇద్దరు కార్మికులు మృతి

20 Jan, 2017 11:56 IST|Sakshi
కుత్బుల్లాపూర్‌:‍ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సెల్‌ ఓవెన్‌ శాక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో డ్రైనేజీ సంప్‌లో పడి ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారు బెంగాల్‌ కు చెందిన అజయ్‌సింగ్‌(23), విజయ్‌సింగ్‌(30)లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు