బాబు ‘బ్రీఫ్డ్ మీ’ అందరు విన్నారు: ఉండవల్లి

16 Nov, 2016 16:03 IST|Sakshi
బాబు ‘బ్రీఫ్డ్ మీ’ అందరు విన్నారు: ఉండవల్లి

హైదరాబాద్: ఓటుకు నోట్లు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. కోర్టుకు ఉన్న విస్తృతమైన అధికారాలతో చంద్రబాబును ముద్దాయిగా చేర్చి కేసును విచారించాలని ఉండవల్లి కోరారు. తప్పుచేసిన ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్న ఆయన.. రేవంత్ రెడ్డికి అన్ని డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.

‘బ్రీఫ్డ్ మీ’  అని చంద్రబాబు అన్న మాటలు అందరూ విన్నారని అన్నారు. ఈ కేసులో మరికాసేపట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తారు. ఈ కేసుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోందని ఉండవల్లి అన్నారు.
 

మరిన్ని వార్తలు