నేడు కేంద్ర విద్యుత్ మంత్రితో కేసీఆర్ భేటీ

20 Nov, 2016 03:09 IST|Sakshi
నేడు కేంద్ర విద్యుత్ మంత్రితో కేసీఆర్ భేటీ

భద్రాద్రి విద్యుత్ కేంద్రానికి అనుమతులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆది వారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఆధ్వర్యంలో నిర్మిం చతలపెట్టిన 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీ అంశంపైసీఎం ఈ భేటీలో చర్చించనున్నా రు. భద్రాద్రి ప్లాంట్‌ను సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించేందుకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారని తెలిసింది.  
 

>
మరిన్ని వార్తలు