సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ చెబుతున్న సర్వే అంతా బోగస్ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లో టీఆర్ఎస్కు 11 సీట్లు కూడా రావని, కేసీఆర్ది గ్లోబెల్స్ ప్రచారమని చెప్పారు.
‘‘ఏం ఘనకార్యాలు చేశారని ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లేయాలో చెప్పాలి. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే తెలంగాణ నంబర్వన్గా ఉన్నందుకా? మద్దతు ధర అడిగిన పాపానికి రైతులపై కేసులు పెట్టి, సంకెళ్లు వేసి హింసించినందుకా? అక్రమ భూసేకరణను అడ్డుకున్న రైతులను కుళ్లబొడిచి నందుకా’’ అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్వే నిజమే అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తక్షణం రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధపడాలని ఉత్తమ్ సవాలు విసిరారు.