వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం

31 May, 2014 11:03 IST|Sakshi
వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో వెంకయ్యకు ఆ పార్టీ ఎంపీలు బండారు దత్తాత్రేయ, విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబుతోపాటు పలువురు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బేగంపేట నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుమలలో ఈ రోజు తెల్లవారుజామున కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమైయ్యారు. ఆ తర్వాత రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు పయనమైన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు