జీవితానికి నీరే ముఖ్య ఇంధనం: వైఎస్ జగన్

22 Mar, 2016 09:17 IST|Sakshi
జీవితానికి నీరే ముఖ్య ఇంధనం: వైఎస్ జగన్

హైదరాబాద్: ఈ భూమిపై మన జీవితానికి నీరే ముఖ్యమైన ఇంధనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్బంగా ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

నేటి నీటి వినియోగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉండాలని చెప్పారు. 'నేడు నీటిని వినియోగించుకోండి. రేపటికి ఆదా చేయండి' అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతున్న నేటి రోజుల్లో నీటిని రక్షించుకోవడం అత్యంత ముఖ్యమైన బాధ్యత అని తెలియంది కాదు.

 

మరిన్ని వార్తలు