'ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించం'

17 Sep, 2016 13:15 IST|Sakshi

హైదరాబాద్: బానిసత్వాన్ని చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. మీకు చేతనైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించకుండా చూడండని హితవు పలికారు.

తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తూ  చంద్రబాబు  కేంద్రానికి లేఖ రాయడంపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు