'జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి చేస్తాం'

5 Apr, 2016 12:22 IST|Sakshi

బాబూజగ్జీవన్‌రాం 109వ జయంతి లోటస్ పాండ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, రోజా, మేరుగ నాగార్జున, నల్లా సూర్యప్రకాశ్ లు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత హక్కులను కాలరాస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి జగ్జీవన్ రాం, అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించే హక్కులేదని అన్నారు.

 

ముఖ్య మంత్రి స్థాయిలో ఉండి...చంద్రబాబునాయుడు పలుమార్లు దళితులను కించపరిచేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు