డబ్బు కోసం యువతి బ్లాక్మెయిల్!

27 Nov, 2014 13:25 IST|Sakshi

హైదరాబాద్ : డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసీఐఎల్లోని జినియా ఆస్పత్రి యజమాని ...తనను నగ్నంగా ఫోటో తీశారని ఆరోపిస్తూ ....రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపుకు దిగింది. దాంతో బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతిపై ఆస్పత్రి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  విచారణ నిమిత్తం పోలీసులు...సదరు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు