సీఐ నుంచిప్రాణహాని ఉందంటున్న మహిళ

14 Jun, 2016 14:08 IST|Sakshi

చిలకలగూడ సీఐ నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఓ మహిళ హెచ్చార్సీని ఆశ్రయించింది. సీతాఫల్‌మండికి చెందిన లలిత..తమను అప్పుల వాళ్లు వేధిస్తున్నారంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. అయితే, సదరు ఫైనాన్సియర్లతో రాజీ చేసుకోవాలంటూ సీఐ కావేటి శ్రీనివాస్ బెదిరిస్తున్నారని లలిత ఆరోపించింది. దీనిపై ఆమె మంగళవారం హెచ్చార్సీని ఆశ్రయించింది.

 

మరిన్ని వార్తలు