ఎయిర్‌పోర్టు రోడ్డుపై మహిళ మృతదేహం

20 Aug, 2016 10:08 IST|Sakshi

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాతంరాయి వద్ద రహదారిపై ఓ మహిళ మృతదేహం శనివారం స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని...మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మహిళను ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదంలో సదరు మహిళ మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు