ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

25 Aug, 2015 22:12 IST|Sakshi

హైదరాబాద్(ఉప్పల్): రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... ఉప్పల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

>
మరిన్ని వార్తలు