గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

4 Feb, 2017 19:37 IST|Sakshi
గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

హైదరాబాద్‌: గచ్చిబౌలి ఐటీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ట్రిపుల్‌ ఐటీ చౌరస్తాలో ముగ్గురు మహిళలు రోడ్డు దాటుతుండగా సెవెన్ సీటర్ ఆటో వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితులు సమీపంలోని ఐటీ సంస్థలో హౌస్ కీపింగ్‌ పనులు చేస్తుంటారని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు