బోడుప్పల్లో యువతి అదృశ్యం

19 Feb, 2017 22:00 IST|Sakshi

బోడుప్పల్‌(హైదరాబాద్‌): ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌ రాజీవ్‌నగర్‌కు చెందిన కె. స్వప్న(26) ప్రైవేట్‌ ఉద్యోగిని. ఈ నెల 15న ఆఫీసు వెళ్లి జీతం తీసుకుని వస్తానని చెప్పిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు