బస్సు ఢీకొని యువకుడి మృతి

4 May, 2016 23:38 IST|Sakshi

శంషాబాద్‌ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి-గొల్లపల్లి రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయాడు.

గొల్లపల్లి గ్రామానికి చెందిన డి.ఆనంద్(22) తన బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.

మరిన్ని వార్తలు