సెల్ ఫోనే ప్రాణం తీసింది

3 Jan, 2015 09:22 IST|Sakshi
సెల్ ఫోనే ప్రాణం తీసింది

హైదరాబాద్: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో శనివారం విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మరణించాడు. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు