ప్రజల్లో జాతీయోద్యమ నేతల ఆశయాలను పాదుగొల్పాలి

15 Aug, 2016 06:56 IST|Sakshi
ప్రజల్లో జాతీయోద్యమ నేతల ఆశయాలను పాదుగొల్పాలి

వైఎస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ పాలన నుంచి దేశ విముక్తి కోసం పోరాడి స్వాతంత్య్రం సాధించిన జాతీయోద్యమ నేతల ఆశయాలు, వారి సిద్ధాంతాలు, విలువలను ప్రజల్లో పాదుగొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తుల అవిరళ కృషి, వారి అంకితభావ పోరాటాలతోనే స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు