హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. శనివారం ఆయన రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. గవర్నర్ను వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. నిన్న గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.