వర్షప్రభావిత జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన

19 Nov, 2015 00:54 IST|Sakshi
వర్షప్రభావిత జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల అతలాకుతలం అవుతున్న జిల్లాల్లో త్వరలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పర్యటించనున్నారు. ఇప్పటికే ఏపీలోని అనేక జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోగా...వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. వైఎస్‌ జగన్‌.. ఆయా జిల్లాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు  జిల్లా అధ్యక్షులను అడిగి తెలుసుకోవడంతో పాటు పార్టీ శ్రేణులు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

 

ఇప్పటికే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి...బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. వైఎస్‌ జగన్‌ పర్యటన రూట్‌ మ్యాప్‌ను ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు.

మరిన్ని వార్తలు