మీకు మేం అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌

4 Dec, 2015 03:02 IST|Sakshi
మీకు మేం అండగా ఉంటాం: వైఎస్‌ జగన్‌

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో వర్షాలు, వరద ముంపుతో విలవిల్లాడుతున్న ప్రజలను ప్రభుత్వాలు, తోటి మానవులు ఇతోధికంగా ఆదుకోవాలని, వారికి సాధ్యమైనంత మేరకు సహాయం అందించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రకృతి సృష్టించిన వరద బీభత్సాన్ని చెన్నైవాసులు మనో నిబ్బరంతో ఎదుర్కొంటున్న తీరు ఆదర్శనీయమని, ఈ క్లిష్ట సమయంలో వారికి తమ సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నామని జగన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు