ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి

8 Apr, 2016 04:36 IST|Sakshi
ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సరం తొలి పండుగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. సకాలంలో వానలు పడి.. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పాడిపంటలతో రైతులు వర్ధిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు