అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ నివాళులు

26 Nov, 2016 19:52 IST|Sakshi
అంబేద్కర్‌కు వైఎస్సార్‌సీపీ నివాళులు

హైదరాబాద్ : వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజ్యాంగ దినోత్సవంపై ప్రసంగించిన నేతలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, భూమన కరుణాకర్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చల్లా మధు, పుత్తా ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు