దళితులకు చంద్రబాబు దగా

4 Apr, 2017 01:25 IST|Sakshi
దళితులకు చంద్రబాబు దగా

 వైఎస్సార్‌సీపీ నేత మేరుగ నాగార్జున ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం దళితులను మోసం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగా ర్జున మండిపడ్డారు. దళితులకు సబ్‌ప్లాన్‌లో కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో మోసం చేస్తోందని చెప్పారు. సబ్‌ప్లాన్‌ నిధులు వేరేవారికి ఖర్చు చేయటానికి ఏకంగా జీఓ తీసుకురావటంతో దళితులపై చంద్రబాబు వైఖరి బట్టబయలు అయిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరులతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఆలోచన విధానమే పూర్తిగా దళిత వ్యతిరేకమని స్పష్టం చేశారు.

దళితులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతోందని అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నిస్తే దళితులను అడ్డంపెట్టి అవాకులు–చెవాకులు మాట్లాడించిన నీచ సంస్కృతి చంద్రబాబుదని మేరుగ మండిపడ్డారు. ప్రస్తుతం దళితుల సంక్షేమాన్ని తన భుజాలపై మోస్తున్న ఒకే ఒక వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే పార్టీ వైఎస్సార్‌సీపీనే అని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకలను విజయవాడలో ఈ నెల 13న వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని మేరుగ తెలిపారు. 5న బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలను ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు