ట్రక్కు, రెండు బస్సులు, కారు, బైక్ ఢీ

11 Aug, 2016 20:22 IST|Sakshi

బీజింగ్: చైనాలో వరుసగా వాహనాలు ఢీకొని పదిమంది ప్రాణాలుకోల్పోయారు. 20మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ట్రక్కు రెండు బస్సులు, ఓ కారు, ఓ బైక్ ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి.

షడాంగ్ ప్రావిన్స్లోని బోషన్ జిల్లాలోగల జిబో నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు తొలుత ఓ బస్సును ఢీకొనగా అది కాస్త మరో బస్సు ఆ వెంటనే మరో కారు ఓ బైక్ ఇలా అన్ని వాహనాలు బలంగా ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి.

మరిన్ని వార్తలు