చెత్తగుట్టలు కూలి 19 మంది మృతి

16 Apr, 2017 03:19 IST|Sakshi
చెత్తగుట్టలు కూలి 19 మంది మృతి

కొలంబో: డంపింగ్‌ యార్డ్‌లోని చెత్తగుట్టలకు నిప్పంటుకోవడంతో అవి సమీపంలోని ఇళ్లపై కూలిపోవడంతో నలుగురు చిన్నారులతో సహా 19 మంది మరణించారు. 14 మంది గాయపడ్డారు. సుమారు 91 మీటర్ల ఎత్తున్న ఈ చెత్త గుట్టలు శ్రీలంక రాజధాని కొలంబో దగ్గర్లోని మీటోతముల్లాలో ఉన్నాయి. ఈ ఘటనలో 100 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా 600 మంది కట్టుబట్టలతో మిగిలారు.

దాదాపు 400 మంది భద్రతా సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడి డంపింగ్‌ యార్డ్‌లో 2 కోట్ల 30 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. 

మరిన్ని వార్తలు