ఘోర రోడ్డు ప్రమాదం.. 12కు చేరిన భారత మృతులు

7 Jun, 2019 15:46 IST|Sakshi

దుబాయి : దుబాయిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భారతీయుల సంఖ్య 12కు పెరిగింది. ఒమన్‌ నుంచి దుబాయికి వెళుతున్న బస్సు అతివేగంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌బోర్డును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో 12 మంది భారతీయులేనని దుబాయిలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ విపుల్‌ తెలిపారు. మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయ్‌శంకర్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు