లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు

7 Mar, 2017 02:00 IST|Sakshi
లాటరీలో ఇండో–అమెరికన్ కు 13 కోట్లు

దుబాయ్‌: యూఏఈలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన శ్రీరాజ్‌ కృష్ణన్  కొప్పరంబిల్‌ అనే వ్యక్తి లాటరీలో రూ.12.71 కోట్ల మొత్తాన్ని గెలుపొందాడు.

అబుదాబిలో ‘బిగ్‌ టికెట్‌’నిర్వహించిన లాటరీలో శ్రీరాజ్‌ విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన శ్రీరాజ్‌ 9 ఏళ్లుగా ఇక్కడ షిప్పింగ్‌ కో–ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. లాటరీ గెలుపొందడంపై శ్రీరాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మొత్తంతో భారత్‌లో ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని తీర్చేస్తానన్నారు. 

మరిన్ని వార్తలు