సిరియాలో పేలుడు, 20 మంది మృతి

16 Oct, 2013 13:45 IST|Sakshi

సిరియా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. దక్షిణాది రాష్ట్రం డారాలోని నావా పట్టణంలో బుధవారం జరిగిన బాంబు పేలుడుకు దాదాపు 20 మంది మరణించగా, మరో 15 మందికిపైగా గాయపడ్డారు.

సిరియాలో మానవ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా డారా రాష్ట్ర మీడియా ఈ విషయంపై స్పందించలేదు. పేలుడు గల కారణాలు పూర్తిగా తెలియాల్సివుంది. సిరియాలో ముస్లింల పండుగ రోజే ఈ ఘటన జరగడం ప్రజల్ని మరింత భయబ్రాంతులకు గురిచేసింది.

మరిన్ని వార్తలు