టోర్నడో విధ్వంసం

4 Mar, 2020 02:54 IST|Sakshi
టోర్నడో కారణంగా ముక్కలు చెక్కలైన ఇల్లు  

అమెరికాలో 22 మంది మృతి 

నాష్‌విల్లే: అమెరికాలోని నాష్‌విల్లేలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం టెన్నెస్సీలో వచ్చిన టోర్నడోల కారణంగా 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది గల్లంతయినట్లు చెప్పారు. దాదాపు 40 భవనాలు నేలమట్టమయినట్లు చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్ల ద్వారా సర్వే చేస్తున్నారు. స్కూళ్లు, కోర్టులు, విమానాశ్రయాలు మూతబడ్డాయి.

మరిన్ని వార్తలు