మెక్సికో : సెంట్రల్ మెక్సికోలోని ప్యూబ్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు... ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. 22 మృతదేహాలను బస్సులో నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
మరో రెండు మృతదేహలను కారు నుంచి వెలికి తీసినట్లు తెలిపారు. మరో పది మంది బస్సు ప్రయాణికులు మాత్రం ప్రమాద సమయంలో బస్సులోని కిటికిలు పగలకొట్టి ప్రాణాలను కాపాడుకున్నారని వివరించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.